హైదరాబాద్,,డిసెంబర్ 13: అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన జగన్ వర్గం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ శాసనసభాపక్షం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ఫిర్యాదు చేసింది. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకోవాలని కోరుతూ విడివిడిగా లేఖలు అందజేసినట్టు ప్రభుత్వ విప్ మురళీమోహన్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన 1.ధర్మాన కృష్ణదాస్ (నర్సన్నపేట), 2. గొల్ల బాబూరావు (పాయకరావుపేట), 3. పిల్లి సుభాష్చంద్రబోస్ (రామచంద్రాపురం) 4. టి. బాలరాజు (పోలవరం) 5. ఎం.ప్రసాదరాజు (నర్సాపురం) 6. మేకతోటి సుచరిత (పత్తిపాడు) 7. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల) 8. బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), 9. మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి) 10. గురునాథ్రెడ్డి (అనంతపురం) 11. కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం) 12. చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు) 13. జి.శ్రీకాంత్రెడ్డి (రాయచోటి) 14. శ్రీనివాసులు (కోడూరు) 15. ఆకేపాటి అమర్నాథ్రెడ్డి (రాజంపేట) 16. కొండా సురేఖ (పరకాల). గతేడాది కాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. వారికి అన్నివిధాలా నచ్చజెప్పి చూశామని, అయినా అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని అన్నారు. అందుకే వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను కోరామన్నారు. రాబోయే ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment