Monday, December 12, 2011

‘ద డర్టీ పిక్చర్’ కు వసూళ్ళే వసూళ్ళు...!

హైదరాబాద్:  విద్యాబాలన్ నటించిన ‘ద డర్టీ పిక్చర్’ వంద కోట్ల రూపాయల బిజినెస్ దిశగా దూసుకెడుతోంది. హిందీతో పాటు తెలగు, తమిళంలో కూడా రిలీజ్ అవ్వడం ఈ సినిమాకు కలిసొచ్చింది. ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే రూ. 65 కోట్ల వసూళ్లు సాధించింది.  ఒకప్పటి దక్షిణాది ఐటం సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కడంతో....స్మిత తెరవెనక జీవితం గురించి తెలుసుకోవడానికి  ప్రేక్షకులు క్యూ కడుతున్నారు . దీనికి తోడు సినిమాపై నెలకొన్ని అనేక వివాదాలు డర్జీ పిక్చర్ కు  పబ్లిసిటీ పెంచేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా బిజినెస్ పూర్తయ్యే నాటికి 100 కోట్ల మార్కు దాటుతుందని సినిమా వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఒక సాధారణ లోబడ్జెట్ చిత్రంగా వచ్చి వంద కోట్ల మార్కును దాటిన సినిమాగా డర్జీ పిక్చర్ రికార్డులు సృష్టించడం ఖాయం. ఈ విజయంతో బాలీవుడ్ ‘ఎ’ గ్రేడ్ హీరోయిన్ల సరసన చేరిన విద్యా బాలన్ తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసింది. ప్రస్తుతం విద్యాబాలన్ రెమ్యూనరేషన్  రూ. 7 కోట్లు ట.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...