రాహుల్ గాంధీపై హజారే ధ్వజం

న్యూఢిల్లీ, డిసెంబర్ 11:  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై హజారే మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని, అయితే కేవలం ఒక్క రోజు పేదల గుడిసెల్లో ఉన్నంత మాత్రాన అవి నెరవేరవని చురకంటించారు. లోక్‌పాల్ బిల్లుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం బలహీన నివేదికను తెచ్చినందుకు నిరసనగా ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేసిన హజారే తమ ప్రసంగంలో ‘ రాహుల్ యువకుడు. ప్రధాని కావాలని ఆశపడుతున్నారు. పల్లెలకు వెళ్లినప్పుడల్లా.. ఒక రాత్రి పేదల గుడిసెల్లో బస చేస్తున్నారు. అయితే ప్రధాని కావాలంటే ఇది సరిపోదు. కొన్ని నెలలపాటు వారి గుడిసెల్లో ఉండాలి. ఇంకెంతో త్యాగం చేయాలి’ అని సూచించారు. ‘లోక్‌పాల్ బిల్లుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం తెచ్చిన పేలవమైన నివేదిక వెనుక రాహుల్ గాంధీ హస్తమున్నట్లు భావిస్తున్నాం. ఇంతకీ స్థాయీ సంఘానికి సీనియర్ బాస్ ఎవరు? బిల్లులో మార్పులు చేసే ధైర్యం రాహుల్‌కు కాక ఇంకెవరికుంది?’ అని హజారే ప్రశ్నించారు.  మళ్ళీ ఇంతలోనే రాహుల్‌పై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు