కార్టూనిస్ట్ మారియో మిరాండా మృ తి

పనాజీ, డిసెంబర్ 11:  ప్రసిద్ధ కార్టూనిస్ట్ మారియో మిరాండా (85) గోవా రాజధాని పనాజీ చేరువలోని లొవుటోలిమ్ గ్రామంలో తన స్వగృహంలో ఆదివారం ఉదయం నిద్రలోనే కన్ను మూశారు.  గోవా ప్రజల జీవన శైలిని తన కార్టూన్లలో ప్రతిబింబించిన మిరాండా ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’ సహా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, ‘ఎకనామిక్ టైమ్స్’, ‘ఫెమినా’ వంటి పత్రికల్లో ఆయన కార్టూన్లు పాఠకాదరణ పొందాయి.   

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు