Monday, December 26, 2011

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప మృతి

బెంగళూరు,డిసెంబర్ 26: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప మృతి చెందారు. గత కొద్దికాలంగా కిడ్ని సంబంధిత వ్యాధితోబాధపడుతున్న బంగారప్ప అదివారం అర్ధరాత్రి 12.40 నిమిషాలకు బెంగళూరులోని మాల్యా ఆస్పత్రిలో మరణించినట్టు బంధువర్గాలు వెల్లడించాయి. న్యాయశాస్త్రంలో పట్టబధ్రుడైన బంగారప్ప.. కర్నాటక రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. కర్నాటక అసెంబ్లీకి 1967 సంవత్సరంలో తొలిసారిగా ఎన్నికైన బంగారప్ప.. 1996 సంవత్సరం వరకు సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా సేవలందించారు. 1990-92 కాలంలో కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆతర్వాత 1996 సంవత్సరంలో 11 లోకసభకు, 1999లో 13 లోకసభకు, 2003 సంవత్సరంలో 14వ లోకసభకు (బీజేపీ అభ్యర్థిగా) బంగారప్ప ఎంపికయ్యారు. బీజేపీకి గుడ్‌బై చెప్పిన ఆయన 2005 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున తిరిగి లోకసభకు ఎంపికయ్యారు. 2009 సంవత్సరంలో సమాజ్‌వాదీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికలో అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప కుమారుడు బీఎస్ రాఘవేంద్ర చేతిలో బంగారప్ప ఓటమి చవిచూశారు. ఆతర్వాత బంగారప్ప జనతాదళ్‌లో పార్టీలో చేరారు.గతంలో ఆయన కర్నాటక వికాస్ పార్టీ, కర్నాటక కాంగ్రెస్ పార్టీలను స్థాపించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...