రెడీ ఫర్ కరెంట్ షాక్...!
హైదరాబాద్,డిసెంబర్ 26: విద్యుత్ చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఆమోదముద్ర వేశారు. దీంతో చార్జీల పెంపునకు అనుమతి నివ్వాలంటూ విద్యుత్ నియంత్రణ మండలిని విద్యుత్ పంపిణీ సంస్థ( డిస్కం) కోరింది. ప్రతిపాదిత పెంపుతో గృహ, పరిశ్రమ, వాణిజ్య వినియోగదారులపై రూ.4,950 కోట్ల భారం పడుతుందని అంచనా. 100 యూనిట్లు పైబడి విద్యుత్ వాడే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. పెంచిన చార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది.
Comments