భారత్ 214/3

మెల్‌బోర్న్,డిసెంబర్ 27: : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో  రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ద్రావిడ్ 68, నైట్ వాచ్‌మెన్ ఇషాంత్ శర్మ పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నారు. రెండవ రోజు ఆటలో సెహ్వాగ్, ద్రావిడ్, సచిన్ టెండూల్కర్‌లు అర్ధ సెంచరీలను నమోదు చేశారు.  అర్ధ సెంచరీ నమోదు చేసుకుని మంచి ఊపు మీద కనిపించిన సచిన్.. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అవుట్ కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. సచిన్ 98 బంతుల్లో 73 పరుగులు చేసి సిడిల్ బౌలింగ్లో  క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. సెహ్వాగ్ 67, గంభీర్ 3 పరుగులు చేశారు.సెహ్వాగ్ 8 వేల పరుగుల క్లబ్‌లో చేరడం, అలెన్ బోర్డర్ 64 అర్ధ సెంచరీల రికార్డును సచిన్ అధిగమించడం రెండవ రోజు ఆటలో విశేషం.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు