Wednesday, December 28, 2011

దడదడలాడిస్తున్న ‘ థానే '

విశాఖపట్నం,డిసెంబర్ 28:  బంగాళాఖాతంలో ఏర్పడిన ‘థానే’ పెను తుపానుగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశలో 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతయిన థానే రాగల 24 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి,  శుక్రవారం కడలూరు-శ్రీహరికోట మధ్య తీరం దాటే   అవకాశముంది. తుపాను ప్రభావంతో గురువారం నుంచి  సముద్రం తీరం వెంబడి 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని,  తమిళనాడు, దక్షిణకోస్తా, చిత్తూరు జిలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుపాను హెచరిక కేంద్రం తెలిపింది.  తుపాను  తీరం దాటే సమయంలో తీరం వెంట 90-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచవచ్చని , మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...