Wednesday, December 28, 2011

తొలి ఇన్నింగ్స్ లో 282 పరుగులకు భారత్‌ ఆలౌట్

ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 179 
మెల్‌బోర్న్,డిసెంబర్ 28: భారత్‌తో జరుగుతున్న తొలిటెస్ట్ లో బుధవారం  మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు రెండవ ఇన్నింగ్స్ లో  8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మైక్ హస్సీ 79, పాటిన్‌సన్ 3 పరుగులతో క్రీజులో నిలిచారు. ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ లో పాంటింగ్ చేసిన 60 పరుగులు తప్ప మిగితా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, జహీర్ 2, ఇషాంత్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో  282 పరుగులకు ఆలౌటైంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...