Wednesday, December 28, 2011

దీక్ష విరమించిన హజారే

ముంబై,డిసెంబర్ 28:  సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ముంబై లో చేపట్టిన మూడు రోజుల నిరాహార దీక్షను జ్వరం కారణంగా  వైద్యుల సలహాపై ఒక  రోజు ముందే బుధవారం సాయంత్రం  విరమించారు. బలహీన లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన మంగళవారం దీక్ష ప్రారంభించారు. మూడు రోజులపాటు దీక్ష చేయాలని భావించారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు రెండో రోజునే దీక్ష విరమించారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, నియంతలు దేశాన్ని పాలిస్తున్నారని దీక్ష విరమించిన తర్వాత హజారే వ్యాఖ్యానించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...