Wednesday, December 28, 2011

యు.పి.ఎ. విజయమా...వైఫల్యమా...?

రాజ్యాంగ హోదా లేకుండా 7 సవరణలతో లోక్‌పాల్ బిల్లుకు  లోక్ సభ ఆమోదం
రాష్ట్రాల్లో లోకాయుక్తల ఏర్పాటు వాటి ఇష్టం...
రాజ్యసభ లో బిల్లు ఆమోదం  అనుమానమే...    
న్యూఢిల్లీ,డిసెంబర్ 28:  అవినీతిని అరికట్టేందుకు  ఉద్దేశించిన లోక్‌పాల్ బిల్లు ఎట్టకేలకు మంగళవారం సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభ ఆమోదం పొందినా.. కాంగ్రెస్‌కు అనూహ్యంగా ఎదురుదెబ్బే తగిలింది. లోక్‌పాల్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా దక్కేలా చేయడంలో మన్మోహన్ సర్కార్ విఫలమైంది. కోరల్లేని లోక్‌పాల్ బిల్లుతో ప్రయోజనం లేదని అటు అన్నా హజారే దీక్షకు దిగి అనారోగ్యం పాలైనా.. ఈ బలహీనమైన బిల్లుకు మేం మద్దతిచ్చేది లేదని బీజేపీ భీష్మించినా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దానిని మాత్రం ఆమోదింపచేసుకోగలిగింది. సీబీఐను లోక్‌పాల్ పరిధిలోకి తేవడం లాంటి భారీ  సవరణలకు తలొగ్గలేదు. లోకాయుక్తలను ఏర్పాటు చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే ఇచ్చే సవరణతో మిత్రపక్షాల మద్దతు పొందగలిగింది. సాయుధ బలగాలను, తీర గస్తీ దళాలను లోక్‌పాల్ విచారణ పరిధి నుంచి తొలగిస్తూ సవరణలు చేసి బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదం పొందేలా చేసుకుంది. అయితే లోక్‌పాల్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలన్న రాహుల్ గాంధీ ప్రతిపాదన మాత్రం నెరవేరలేదు. రాజ్యాంగ హోదా కల్పించేందుకు ప్రవేశపెట్టిన బిల్లు.. సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేక పోయింది. లోక్‌సభ ఆమోదించిన లోక్‌పాల్ బిల్లు బుధవారం రాజ్యసభలో చర్చకు రానుంది. అయితే రాజ్యసభలో యూపీఏ పక్షాలకు మెజారిటీ లేనందున బిల్లు ఆమోదం అనుమానమే. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...