Wednesday, December 21, 2011

న్యూజెర్సీలో చిన్నవిమానం కూలి భారతీయుని మృతి

న్యూయార్క్,డిసెంబర్ 22: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన విమాన ప్రమాదంలో భారతీయుడొకరు మృతి  చెందారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో భారతీయుడు రాకేష్ చావ్లా( 36) తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న చిన్న విమానం రద్గీగా ఉండే న్యూజెర్సీ హైవేపై కుప్పకూలింది. న్యూయార్క్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ‘గ్రీన్‌హిల్ అండ్ కో’ లో చావ్లా మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక సేవల రంగంలో నిష్ణాతుడైన రాకేష్ చావ్లా 2003లో బ్లాక్‌స్టోన్ గ్రూపు నుంచి గ్రీన్‌హిల్‌లో చేరారు.ఇదే కంపెనీకి చెందిన మరో ఎండీ జెఫ్రీ బక్లాల్యూ(45), ఆయన భార్య, వారి ఇద్దరు పిల్లలు ప్రమాదంలో చనిపోయారు. న్యూజెర్సీ టెటర్‌బరో ఎయిర్‌పోర్ట్ నుంచి గాల్లోకి ఎగిరిన 14 నిమిషాల తర్వాత విమానం ప్రమాదానికి గురయిందని ఫెడరల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి జిమ్ పీటర్స్ తెలిపారు. 2005 సొకాటా సింగిల్-ఇంజిన్ టర్బోప్రొప్ రకానికి చెందిన ఈ విమానంలో చావ్లా, జెఫ్రీ కుటుంబం అట్లాంటాకు వెడుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...