న్యూఢిల్లీ,డిసెంబర్ 16: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రమేయంపై ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. తన మాజీ క్లయింట్ అయిన సునైర్ హోటల్స్ లిమిటెడ్ చైర్మన్ ఎస్.పి. గుప్తాపై నమోదైన మూడు చీటింగ్, ఫోర్జరీ కేసులను ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన చిదంబరం గతంలో గుప్తా తరఫున ఢిల్లీ హైకోర్టులో వాదించారని... నాటి పరిచయం దృష్ట్యా కేసులను ఉపసంహరించాలని హోంమంత్రి హోదాలో ఆదేశించారంటూ ఓ ఆంగ్ల పత్రిక, చానల్లో కథనం వచ్చింది. దీంతో చిదంబరం రాజీనామాకు పట్టుబడుతూ విపక్షాలు గురువారం పార్లమెంటులో తీవ్ర గందరగోళం సృష్టించాయి. ఫలితంగా ఉభయసభలూ పలుమార్లు వాయిదాపడ్డాయి. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ పేర్లు చెప్పుకొని గుప్తా తమ నుంచి కోట్లాది రూపాయలు రుణం తీసుకొని మోసం చేశాడని వీఎల్ఎస్ ఫైనాన్స్ అనే సంస్థ ఈ కేసులు పెట్టింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం చిదంబరంపై విపక్షాల ఆరోపణలన్నీ ఏకపక్షమైనవంటూ ఆయన్ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. కేసుల ఉపసంహరణ విషయం చిదంబరానికి తెలియదని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ఆగమేఘాలపై హోటల్ యజమానిపై కేసుల విచారణను నిలుపుదలచేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ కేసులపై విచారణ కొనసాగుతుందని వెల్లడించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment