హైదరాబాద్,డిసెంబర్ 10: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమాస్తుల కేసు శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ బాబు, ఆయన బినామీలు వేర్వేరుగా దాఖలు చేసుకున్న అనుబంధ పిటిషన్లను విచారించేందుకు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం కూడా నిరాకరించింది. కేసును మరో ధర్మాసనానికి నివేదించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.లోకూర్కు విజ్ఞప్తి చేసింది. దాంతో న్యాయమూర్తులు జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ అశుతోష్ మొహంతాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనానికి ఈ కేసు విచారణ బాధ్యతలను సీజే అప్పగించారు. సోమవారం విచారణ జరగనుంది. బాబు కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన రిలయన్స్లో తనకు వాటాలున్నాయని సీజే పేర్కొనడం, ఆయన నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నుంచి వైదొలగడం, జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనానికి కేసును అప్పగించడం తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment