Friday, December 9, 2011

బాబు అక్రమాస్తుల కేసులో మరో మలుపు

హైదరాబాద్,డిసెంబర్ 10:  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమాస్తుల కేసు శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ బాబు, ఆయన బినామీలు వేర్వేరుగా దాఖలు చేసుకున్న అనుబంధ పిటిషన్లను విచారించేందుకు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం కూడా నిరాకరించింది. కేసును మరో ధర్మాసనానికి నివేదించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.లోకూర్‌కు విజ్ఞప్తి చేసింది. దాంతో న్యాయమూర్తులు జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ అశుతోష్ మొహంతాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనానికి ఈ కేసు విచారణ బాధ్యతలను సీజే అప్పగించారు. సోమవారం విచారణ జరగనుంది. బాబు కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన రిలయన్స్‌లో తనకు వాటాలున్నాయని సీజే పేర్కొనడం, ఆయన నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నుంచి వైదొలగడం, జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనానికి కేసును అప్పగించడం తెలిసిందే.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...