రాజ్యాంగబద్ధ సంస్థగా లోక్‌పాల్

న్యూఢిల్లీ,డిసెంబర్ 10:   లోక్‌పాల్ బిల్లును పరిశీలన చేస్తున్న పార్లమెంటు స్థాయీ సంఘం  తన నివేదికను శుక్రవారం పార్లమెంటుకు సమర్పించింది. సంఘం చైర్మన్ అభిషేక్ మను సింఘ్వి.. 286 పేజీల నివేదికను రాజ్యసభకు అందించగా, కమిటీ సభ్యుడు పినాకి మిశ్రా లోక్‌సభలో ఇచ్చారు. చర్చల సందర్భంగా తమకు అందిన ఆధారాలను కూడా రెండు సభలకు అందించారు. అనంతరం సింఘ్వి విలేకరులతో మాట్లాడుతూ.. లోక్‌పాల్‌ను రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వల్ల.. మొత్తం ప్రక్రియే ఆలస్యమవుతుందన్న వాదనను తోసిపుచ్చారు. రాజ్యాంగ బద్ధతను ఒక్క రోజులో కల్పించవచ్చన్నారు. లోక్‌పాల్‌ను రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హర్షం వ్యక్తంచేశారు. దీని ద్వారా ఆ అథారిటీకి సమగ్రత, ప్రత్యేక హక్కులు లభిస్తాయని అన్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు