కోల్కతా కార్పొరేట్ ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం:90 మంది మృతి
కోల్కతా,డిసెంబర్ 10: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా నగరంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో జరిగన ఘోర అగ్ని ప్రమాదంలో 90 మంది మరణించారు. వీరంతా మంటల బారిన పడకున్నా.. వాటివల్ల వెల్లువెత్తిన దట్టమైన పొగ, విషయవాయువు వల్ల ఊపిరాడక చనిపోయారు. మృతుల్లో అత్యధికులు వివిధ అనారోగ్యాలతో చికిత్స పొందుతూ.. కదలలేక మంచాల మీద ఉన్న రోగులే కావటం బాధాకరం. దక్షిణ కోల్కతా లోని ధాకూరియా ప్రాంతంలో గల ఏఎంఆర్ఐ ఆస్పత్రిలో ఈ దారుణం సంభవించింది. ఏడంతస్తుల ఈ సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఆస్పత్రి భవనంలో మొత్తం 190 పడకలు ఉన్నాయి. ఐసీయూ, ఐసీసీయూ, ఇంటెన్సివ్ థెరపీ యూనిట్, క్రిటికల్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్న రోగులు అత్యధికంగా ఈ ప్రమాదంలో మరణించారు. నిర్లక్ష్యపూరిత వైఖరితో 90 మంది మృతికి కారణమైన ఘటనకు సంబంధించి పోలీసులు ఆస్పత్రి యాజమాన్యంపై బెయిల్కు అవకాశం లేని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, ఆస్పత్రి యాజమాన్య బోర్డులో సభ్యులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆర్.ఎస్.గోయెంకా, ఎస్.కె.టోడిలు సహా ఆరుగురిని అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం మీడియాకు తెలిపారు.

Comments