వై.ఎస్.విజయమ్మ పిటిషన్ పై హైకోర్ట్ ఆదేశం
హైదరాబాద్,నవంబర్ 14: : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆస్తులపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. చంద్రబాబు ఆస్తులపై మూడు నెలల్లో ప్రాథమిక విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని కోర్టు ఆదేశించింది. 1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు విజయమ్మ ఆరోపించారు. చంద్రబాబు అక్రమ ఆస్తులు, అవినీతి వ్యవహారాలు, బినామీ ఆస్తులు, భూ ఆక్రమణ తదితర అంశాలను వివరిస్తూ విజయమ్మ 2424 పేజీల నివేదికని కోర్టుకు సమర్పించారు. చంద్రబాబు బినామీ సంబంధాలు, ఎంపి సుజనా చౌదరి, సిఎం రమేష్ లతో ఉన్న వ్యాపార సంబంధాలు, ఏలేరు కుంభకోణంలో కోట్ల రూపాయల అక్రమార్జన వ్యవహారాలను కూడా ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.హెరిటేజ్ డెయిరీకి ఏ విధంగా లాభాలు చేకూర్చింది, సింగపూర్ లో హొటల్ వివరాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో చంద్రబాబు సాగించిన కార్యకలాపాలను విజయమ్మ తన పిటిషన్ లో వివరించారు. పిటిషన్ ని విచారణకు స్వీకరించిన కోర్టు చంద్రబాబుతోపాటు 13 మందిపై విచారణ జరపాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు పంపారు. నారా భువనేశ్వరి, ఆమె కంపెనీలు, లోకేష్, రామోజీరావు, ఆయన కంపెనీలు, అహోబలరావు, ఎంపి వైఎస్ చౌదరి, మాగంటి మురళీ మోహన్,కర్నాటి వెంకటేశ్వరరావు, సిఎం రమేష్ల వ్యక్తిగత ఆస్తులపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.
No comments:
Post a Comment