Sunday, November 27, 2011

పెద్దపల్లిలో కిషన్‌జీ అంత్యక్రియలు

హైదరాబాద్,నవంబర్ 27: పశ్చిమబెంగాల్ లో ఎన్ కౌంటర్  లో మరణించిన నక్సలైట్ నాయకుడు కిషన్‌జీ (మల్లోజుల కోటేశ్వరరావు) మృతదేహాన్ని  పెద్దపల్లికి చేర్చారు.  శనివారం రాత్రి పశ్చిమబెంగాల్‌నుంచి విమానంలో కిషన్‌జీ భౌతిక కాయం హైదరాబాద్ వచ్చింది.  పౌరహక్కుల సంఘాలు, విరసం నాయకులు, విప్లవ సానుభూతిపరులు, కిషన్‌జీ కుటుంబసభ్యులూ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌కు ఆయన మృతదేహాన్ని తరలించి ప్రజల సందర్శనార్థం రెండు గంటలు ఉంచి అప్పుడు పెద్దపల్లికి తీసుకువెళ్దామనుకున్నారు. అయితె అందుకు పోలీసులు నిరాకరించారు. విమానాశ్రయం నుంచి నేరుగా   కిషన్‌జీ మృతదేహాన్ని పెద్దపల్లికి తరలించారు. పెద్దపల్లిలో కిషన్‌జీ అంతిమ యాత్ర ఆదివారం  మధ్యాహ్నం మొదలైంది. ఈ యాత్రలో పౌరహక్కులు, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాది మంది పాల్గొన్నారు.  మావోయిస్టు పార్టీ సిద్ధాంతం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు.
డిసెంబరు 4, 5, తేదీలలో దేశవ్యాప్త బంద్
కాగా, కిషన్‌జీ ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 29 నుంచి డిసెంబరు 5 వరకు నిరసన వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 4, 5, తేదీలలో దేశవ్యాప్త బంద్ కు పిలుపు ఇచ్చారు. 1,2 తేదీలలో తెలంగాణ బంద్ కు పిలుపు ఇచ్చారు. బంద్ నుంచి వైద్యసేవలను మినహాయించారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...