రెండు లగ్జరీ బస్సులు ఢీ: 13మంది దుర్మరణం
నాగపూర్,నవంబర్ 28: మహారాష్ట్రలో సోమవారం తెల్లవారు ఝామున నాగపూర్-ఔరంగాబాద్ జాతీయ రహదారిపై బుల్దాన్ సమీపంలో రెండు లగ్జరీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 13మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 70మంది గాయపడ్డారు. వారిలో 20మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
Comments