Sunday, November 27, 2011

కిరణ్ బేడీపై చీటింగ్ కేసు...!

న్యూఢిల్లీ,నవంబర్ 27: మాజీ ఐపియస్ అధికారి, అన్నా హజారే టీమ్ సభ్యురాలు కిరణ్ బేడీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు  ఆదేశించింది. చీటింగ్, విదేశీ కంపెనీలతోనూ ఇతర ఫౌండేషన్లతోనూ కుమ్మక్కయి నిధుల అవకతకవకలకు పాల్పడిన ఆరోపణలపై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన న్యాయవాది దేవేందర్ సింగ్ చౌహాన్ చేసిన పిర్యాదు మేరకు కిరణ్ బేడీపై కేసు నమోదు చేయాలని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అమిత్ బన్సాల్  ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆదేశించారు. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటిబిపి, సిఆర్‌పిఎఫ్, ఇతర పోలీసు సంస్థల అధికారుల పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఇండియా విజన్ ఫౌండేషన్ కింద ఉచిత శిక్షణ ఇస్తానని చెప్పి మైక్రోసాఫ్ట్ నుంచి కిరణ్ బేడీ 50 లక్షలు తీసుకున్నారని చౌహాన్ ఆరోపించారు. ఉచిత శిక్షణ ఇవ్వకుండా, కంప్యూటర్లను ఉచితంగా పంపిణీ చేయకుండా గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి వేదాంత ఫౌండేషన్‌ను మోసం చేసినట్లు అతను ఆరోపించాడు. శిక్షణా కేంద్రం కోసం పారామిలిటరి, సివిల్ పోలీసుల నుంచి నెలకు 20 వేల రూపాయల చొప్పున వసూలు చేయడానికి ఆమె పూనుకున్నారని న్యాయవాది తన పిటిషన్‌లో అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...