Monday, October 10, 2011

మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు మృతి

రాజమండ్రి, అక్టోబర్ 10:  రాష్ట్ర మాజీ మంత్రి   జక్కంపూడి రామ్మోహనరావు (58)  కన్నుమూశారు. జక్కంపూడి 2006 నుంచి ఎముకలకు సంబంధించిన ‘డయాబెటిక్ న్యూరోపతి’ వ్యాధితో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం స్వల్ప అనారోగ్యానికి గురైనప్పటికీ.. శనివారానికి కోలుకుని మామూలుగానే ఉన్నారు. ఆదివారం సాయంత్రం ధవళేశ్వరంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లాల్సి ఉండగా.. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గదిలో నిద్రపోతున్న ఆయనను కుటుంబసభ్యులు మేల్కొలిపేందుకు ప్రయత్నిం చారు.ఆయన లేవకపోవడంతో కాసేపు ఆగి 3.50 గంటలకు మరోసారి నిద్రలేపే ప్రయత్నం చేశారు. శరీరం అచేతనంగా, చల్లగా ఉండడంతో ఆందోళన చెంది ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే తుదిశ్వాస విడిచినట్టు నిర్ధారించారు. జక్కంపూడి మృతికి సంతాపంగా సోమవారం రాజమండ్రిలోని వ్యాపారసంస్థలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు సెలవు ప్రకటించారు. జక్కంపూడి 1953 ఆగస్టు 6న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రులో జన్మించారు. తాటిపాకలో ప్రాథమిక విద్య, . 1970లో వీటీ జూనియర్ కాలేజి స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నాటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి 1989లో కడియం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 1999, 2004 సంవత్సరాల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రీతి పాత్రుడైన జక్కంపూడి 2004లో కేబినెట్ మంత్రిగా రోడ్డు, భవనాల శాఖ బాధ్యతలు స్వీకరించారు. 2007లో కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయనకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అప్పగించారు. దీనికి ఏడాది ముందు జక్కంపూడి కాస్త అనారోగ్యం పాలవడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో వైద్యం చేయిం చారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తీసుకువెళ్లారు. అనంతరం బెంగళూరు, చెన్నైల్లో చికిత్స చేయించారు. అత్యున్నత వైద్యం చేయించినా ఆయన కొన్నేళ్లుగా నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో 2009 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే స్థానానికి జక్కంపూడికి బదులు ఆయన భార్య విజయలక్ష్మి పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.      

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...