Monday, October 3, 2011

ముందు రాజీనామాలు...తర్వాత తెగదెంపులు...

 భవిష్యత్తు కార్యాచరణ పై టి.కాంగ్రెస్ తర్జనభర్జన
హైదరాబాద్,అక్టోబర్ 3:   ఢిల్లీలో మకాం వేసి, అధిష్టానం పెద్దలను కలిసినా ఏ మాత్రం ఫలితం లభించకపోవడంతో కాంగ్రెసు తెలంగాణ ప్రజా ప్రతినిధులు భవిష్యత్తు కార్యాచరణ పై తర్జనభర్జనలు పడుతున్నారు. పార్టీ  ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ నివేదిక సమర్పించినప్పటికీ తెలంగాణపై అధిష్టానం తేల్చే పరిస్థితి లేకపోవడంతో  మొదట మంత్రి పదవులకు, శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేయాలని  భావిస్తున్నట్లు సమాచారం. అయితే,  ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసిన తర్వాత ప్రధాని స్పందనను బట్టి  కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని వారు భావిస్తున్నారుట.  నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయడంతో  తాము కూడా అదే బాట పట్టాలని వారు అనుకుంటున్నట్లు సమాచారం. తొలుత స్టీరింగ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న జానా రెడ్డి మంత్రి పదవికి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, శాసనసభ్యులు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముందు జూపల్లి కృష్ణా రావు మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే....

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...