దుర్గమ్మకు సరస్వతీ అలంకారం

హైదరాబాద్,అక్టోబర్ 3:   దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ సోమవారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం   కావడంతో  అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది.   
బాసరలో బారీగా అక్షరాభ్యాసాలు 
ఆదిలాబాద్ జిల్లాలోని  సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో కూడా  సోమవారం  అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం  కావడంతో సర్వసతీదేవిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.  వేలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. మూలా నక్షత్రం రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్త్తే చదువు బాగా అబ్బుతుందని భక్తుల విశ్వాసం. 
కాగా తిరుమల బ్రహ్మోత్సవాలలో సోమవారం నాడు ఉదయం స్వామి వారు మోహినీ రూపంలో భక్తులకు పారవశ్యం కలిగించారు.



Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు