‘రామ్ ధున్’ ఆలపించిన ప్రతిభాపాటిల్
జెనీవా ,అక్టోబర్ 3: మహాత్ముని స్మృతి గీతాన్ని ముద్దుగా ఆలపించిన ప్రవాస చిన్నారులతో రాహ్ట్రపతి ప్రతిభాపాటిల్ శృతి కలిపారు. స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న ప్రతిభాపాటిల్ గాంధీ జయంతిని పురస్కరించుకుని జెనీవా నగరంలోని ట్రాంక్విల్ ఏరియానా పార్కులో గల ‘శాంతి స్థలి’ లో మహాత్ముని విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన చిన్నారులతో కలిసి గాంధీకి ఇష్టమైన హిందీ గీతం ‘రామ్ ధున్’ ఆలపించారు. అనంతరం సాంప్రదాయరీతిలో పరిక్రమపాటించారు. తదుపరి చిన్నారులతో కాసేపు ముచ్చట్లాడారు. భారత్- స్విస్ సంబంధాలకు 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 1997లో ఇక్కడ గాంధీ మహాత్ముని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Comments