Thursday, October 20, 2011

తెలంగాణకు శాసనసభ తీర్మానం అవసరం లేదు; అద్వానీ

జనచేతన యాత్రలో భాగంగా తెలంగాణా పర్యటనలో తన రధం నుంచి ప్రజలకు అభివాదం చెస్తున్న అద్వానీ...


హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణకు రాష్ట్ర శాసనసభ తీర్మానం అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుని పార్లమెంటులో బిల్లు పెడితే చాలునని మాజీ ఉపప్రధాని, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు లాల్‌క్రిష్ణ అద్వానీ చెప్పారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నాటకాలాడుతోందని విమర్శించారు. జనచేతన యాత్రలో భాగంగా హైదరాబాద్‌లో బుధవారం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. 38 నిమిషాలపాటు జరిగిన అద్వానీ ప్రసంగంలో దేశంలోని అవినీతి, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటులో సాధారణ మెజారిటీ తో రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చునని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బిల్లుపెడితే చాలునని, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అనుకుని బిల్లుపెడితే భారతీయ జనతా పార్టీ మద్దతునిస్తుందని  అద్వానీ అన్నారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటుచేసినప్పుడు కూడా ఆయా రాష్ట్రాల్లోని ఇద్దరు సీఎంలు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇంతకు ముందు తాను ఐదుసార్లు యాత్రలు చేశానని, ఈ జనచేతన యాత్రకు హాజరైన జనసందోహం, లభించిన మద్దతు ఎప్పుడూ చూడలేదని అద్వానీ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా కుంభకోణాల్లో కూరుకుపోయినా ప్రధానమంత్రి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తేవడమే లక్ష్యంగా పోరాడతామని స్పష్టంచేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...