మొక్కులు తీర్చుకున్న రజని
హైదరాబాద్, అక్టోబర్ 20: వైద్యుల సలహా మేరకు విశ్రాంతిలో ఉన్న తాను మరో రెండు, మూడు నెలల తర్వాత సినిమాల్లో నటిస్తానని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు సూపర్స్టార్ రజనీకాంత్ తెలిపారు. ఇటీవల అనారోగ్యానికి గురై విదేశాల్లో చికిత్స పొందిన రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడింది. బుధవారం రాత్రి ఆయన సకుటుంబ సపరివార సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల అభిమానం వల్ల ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. రా.వన్ సినిమాలో తాను అతిథి పాత్ర పోషిస్తున్నాననీ, అది యాక్షన్, కాస్ట్యూమ్ చిత్రమని చెప్పారు.
Comments