బెంగళూరులో మెట్రోరైలు పరుగులు

బెంగళూరు ,అక్టోబర్ 20:  దక్షిణాదిలో తొలిసారిగా బెంగళూరులో మెట్రోరైలు గురువారం నాడు  పట్టాలు ఎక్కింది. కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ సమక్షంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కమలనాథ్, రైల్వే సహాయ మంత్రి దినేశ్ త్రివేదీ పచ్చ జెండా ఊపి  మెట్రోరైలును ప్రారంభించారు. తొలి దశలో మహాత్మా గాంధీ రోడ్డు నుంచి బయ్యప్పనహళ్లి వరకు ఏడు కిలోమీటర్ల దూరం మెట్రోరైలు ప్రయాణిస్తుంది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రోజూ 91 ట్రిప్పులు మెట్రోరైళ్లు తిరుగుతాయి. ట్రిప్పుకు వెయ్యి మంది ప్రయాణించే వీలుంది.వై-ఫై సదుపాయం ఉన్నందున ప్రయాణికులు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్స్, మొబైల్ ఇంటర్‌నెట్‌లను వినియోగించుకోవచ్చు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు