హైదరాబాద్, అక్టోబర్ 4: రిటైర్డ్ ఉద్యోగులపై సకల జనుల సమ్మె తీవ్ర ప్రభావాన్ని చూపింది. వారి జీవనాధారమైన పెన్షన్ చెల్లింపులు సమ్మె కారణంగా నిలిచిపోయాయి. హైదరాబాద్ మినహా తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో పెన్షన్ చెల్లింపులు జరగకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు పండుగపూట ఉస్సురనే పరిస్థితి నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా 2.5 లక్షల మంది పెన్షనర్లు ఉండగా, వారిలో హైదరాబాద్కు చెందిన లక్షమందికే చెల్లింపులు జరిగాయి. పెన్షన్ చెల్లింపుల కోసం జిల్లా కార్యాలయాల్లో బిల్లులు తయారుచేసే పనిలేకపోయినా ట్రెజరీ ఆఫీసుల్లో వాటిని పాస్చేసే సిబ్బంది లేకపోవడమే ఇందుకు కారణం. జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లోని సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో పాటు అక్కడక్కడా పనిచేస్తున్న వారిని కూడా ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కాగా, తెలంగాణవ్యాప్తంగా ఉద్యోగులకు జీతాల కింద ఇవ్వాల్సిన రూ. 800 కోట్ల చెల్లింపులు సమ్మె కారణంగా నిలిచిపోయాయి. .
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment