పండగ పూట ఉస్సురంటున్న పెన్షనర్లు...

హైదరాబాద్, అక్టోబర్ 4:  రిటైర్డ్  ఉద్యోగులపై సకల జనుల సమ్మె తీవ్ర ప్రభావాన్ని చూపింది. వారి  జీవనాధారమైన పెన్షన్ చెల్లింపులు సమ్మె కారణంగా నిలిచిపోయాయి. హైదరాబాద్ మినహా తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో పెన్షన్ చెల్లింపులు జరగకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు పండుగపూట ఉస్సురనే పరిస్థితి నెలకొంది.  తెలంగాణ వ్యాప్తంగా 2.5 లక్షల మంది పెన్షనర్లు ఉండగా, వారిలో హైదరాబాద్‌కు చెందిన లక్షమందికే చెల్లింపులు జరిగాయి. పెన్షన్ చెల్లింపుల కోసం జిల్లా కార్యాలయాల్లో బిల్లులు తయారుచేసే పనిలేకపోయినా ట్రెజరీ ఆఫీసుల్లో వాటిని పాస్‌చేసే సిబ్బంది లేకపోవడమే ఇందుకు కారణం. జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లోని సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో పాటు అక్కడక్కడా పనిచేస్తున్న వారిని కూడా ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కాగా, తెలంగాణవ్యాప్తంగా ఉద్యోగులకు జీతాల కింద ఇవ్వాల్సిన రూ. 800 కోట్ల చెల్లింపులు సమ్మె కారణంగా నిలిచిపోయాయి. . 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు