హైదరాబాద్, అక్టోబర్ 4: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థిక నష్టాలు, ఆందోళనలతో సతమతమవుతున్న ఆర్టీసీని ఇక గట్టెక్కించడం కష్టమని భావిస్తున్న సర్కారు, 40 శాతం వాటాను ప్రైవేటుపరం చేసే దిశగా అడుగులు వేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఒకవేళ ప్రైవేటీకరణపట్ల అభ్యంతరం వెల్లువెత్తిన పక్షంలో ఇతర రాష్ట్రాల తరహాలో ప్రాంతాల వారీగా ఆర్టీసీని ఐదు ముక్కలు (ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, మధ్య) గా విడగొట్టాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఈ అంశాలతోపాటు కొన్ని రూట్లను ప్రైవేట్ పరం (పీపీపీ) చేయాలనే అంశాన్ని కూడా తీవ్రంగా పరిశీలిస్తోంది. సకల జనుల సమ్మె నేపథ్యంలో గడిచిన రెండు వారాలుగా తెలంగాణలో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 210 డిపోలు, 24,000 బస్సులు ఉన్న ఆర్టీసీ ఇప్పటికే పీకల లోతు నష్టాల్లో కూరుకుపోయింది. తాజాగా సకల జనుల సమ్మె కారణంగా ఇప్పటివరకు రూ.106 కోట్ల న ష్టం వాటిల్లింది. రోజులు గడుస్తున్నా సమ్మె విరమణకు కార్మికులు ససేమిరా అనడంతో దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ కనీసం వెయ్యి బస్సులనైనా రోడ్డు మీదకు తేలేకపోయింది. రాష్ట్రంలో రోడ్డు రవాణా వ్యవస్థ మొత్తం ప్రభుత్వం చేతిలో ఉండిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లుగా సీఎం నిర్ణయానికి వచ్చారు. దీంతో భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆర్టీసీని కొంతైనా ప్రైవేటీకరిస్తేనే మేలనే అభిప్రాయానికి వచ్చిన ట్లు తెలిసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment