న్యూఢిల్లీ, అక్టోబర్ 20: తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోలేమని ప్రధాని మన్మోహన్సింగ్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్య నిర్ణయానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ అంశం పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడంలేదన్న విమర్శను ప్రధాని తోసిపుచ్చారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకొని ప్రధాని మన్మోహన్సింగ్ బుధవారం రాత్రి స్వదేశం చేరుకున్నారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో విలేకరులతో పలు అంశాలపై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కొత్తదేమీ కాదని, దానికి సుదీర్ఘ చరిత్ర ఉందని చెప్పారు. 1950ల నుంచి ఈ ఉద్యమం ఉందని అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా తక్షణ నిర్ణయాలు తీసుకోవడం కష్టమని, ఇందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. విస్తృత స్థాయిలో చర్చల ద్వారానే దీనికో పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందని తెలిపారు. అందువల్ల తెలంగాణతో ముడిపడి ఉన్న అందరితో కేంద్రం విస్తృత స్థాయి సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ చర్చల ద్వారాఅందరికీ ఆమోదయోగ్య పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ తనపై పదేపదే విమర్శలు చేయడంపై ప్రధాని స్పందించారు. విదేశీగడ్డపై ఓ జాతీయ నేతను విమర్శించనంటూనే అద్వానీ పరుష పదజాలం వాడరాదని అద్వానీకి సూచించారు. ఆయన చేపట్టిన జనచేతన యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment