Tuesday, October 18, 2011

సింగరేణి సమ్మె కూడా ముగిసింది...

హైదరాబాద్,అక్టోబర్ 18:   సింగరేణి కార్మికులతో యాజమాన్యం చర్చలు ఫలించాయి.  తెలంగాణ సాధన కోసం గత 35 రోజులకు పైగా సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న సింగరేణి కార్మికులతో సోమవారం సాయంత్రం ప్రారంభమైన చర్చలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగాయి. కార్మికులు, ఉద్యోగులకు అడ్వాన్సుగా రూ.25 వేలు చెల్లించేందుకు అంగీకరించిన యాజమాన్యం.. వాటిని వెంటనే కాకుండా తొమ్మిదో వేతన సవరణ సంఘం ద్వారా వచ్చే వేతనాల్లో సర్దుబాటు చేసేందుకు కూడా సమ్మతించింది. సమ్మె కాలాన్ని కార్మికులకు ఉన్న సెలవులతో సర్దుబాటు చేసేందుకు కూడా అంగీకరించింది. అయితే ప్రత్యేక సెలవుగా పరిగణించడానికి నిరాకరించింది.  కాగా, మంగళవారం నుంచి  సింగరేణి కార్మికులు విధులకు హాజరవుతున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...