ఇక తెలుగు లోనూ ' డాట్రీ ' పరీక్ష...!
న్యూఢిల్లీ,అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్ సహా మరో మూడు రాష్ట్రాల్లో వైద్య విద్య జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ను ప్రాంతీయ భాషలోనే నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్ గురువారం ప్రకటించారు. ఇది విద్యార్థులకు లాభిస్తుందని, వారు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. ‘జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై భారత వైద్య మండలి అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించగా తమిళనాడు మాత్రమే అభ్యంతరాలు తెలిపిందని అన్నారు. పండుగల నేపథ్యంలో తెలంగాణలో ఉద్యోగులు సమ్మె విరమించడం హర్షనీయమని ఆజాద్ అన్నారు. ‘తెలంగాణ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని, గతంలో చెప్పినట్టుగానే సత్వర పరిష్కారానికి కట్టుబడామని చెప్పారు.
Comments