Thursday, October 13, 2011

కెసిఆర్ పై విజయ ' అశాంతి '

హైదరాబాద్,అక్టోబర్ 13:   తెలంగాణ రాష్ట్ర సమితి  అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ఆ పార్టీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి విభేదిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ విషయంలో కాంగ్రెసును కెసిఆర్ విశ్వసించడాన్ని ఆమె పరోక్షంగా తప్పు పడుతున్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తుందనే విశ్వాసం తనకు లేదని, అందరూ కూర్చుని ఏదో ఒకటి మాట్లాడుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆమె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాను, కెసిఆర్ మాత్రమే కాకుండా ఉద్యోగులు, తదితర వర్గాలు కూడా మాట్లాడుకుని తదుపరి కార్యక్రమాన్ని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇస్తుందనే నమ్మకమైతే తనకు లేదని  అన్నారు. తమను కాంగ్రెసు పార్టీవారు అవమానిస్తున్నారని, తన పార్టీని, తన అధ్యక్షుడిని కాంగ్రెసు పార్టీవారు అవమానిస్తుంటే రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆమె అన్నారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ పై తనకు గౌవరం ఉందని, ఆద్వానీ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆమె చెప్పారు. తాను బిజెపిలో ఉన్నానని, ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశానని, తెరాసలోకి వచ్చానని, తాను జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడుతున్నానని,  ఇలా ఎన్నాళ్లు కాంగ్రెసును నమ్ముకుంటూ పోతామని ఆమె అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ దాటవేసే పనినే పెట్టుకుందని, తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెసుకు లేదని ఆమె అన్నారు. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. డిజిపి దినేష్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. దమ్ముంటే తెలంగాణ ఇస్తారో, లేదో కాంగ్రెసు నాయకత్వం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తనకైతే కాంగ్రెసు నాయకులు మోసం చేస్తారనే అనిపిస్తోందని విజయశాంతి అన్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ కోసం ఢిల్లీ వెళ్లారని, వారు అవమానిస్తుంటే మనం ఎందుకు వారితో మాట్లాడాలని ఆమె అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...