సమ్మె విరమిస్తేనే ఉద్యోగ సంఘాలతోచర్చలు: ప్రభుత్వం
హైదరాబాద్,అక్టోబర్ 13: తెలంగాణ ఉద్యోగులు సమ్మె విరమిస్తేనే చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రితో సమావేశమయిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలు విధించిన మూడు డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలంటే ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె విరమణ ప్రకటన చేయాలని పేర్కొంది.
Comments