Saturday, October 15, 2011

రైల్ రోకోలో అరెస్ట్ ల పర్వం

హైదరాబాద్,అక్టోబర్ 15:  : తెలంగాణవ్యాప్తంగా జరుగుతున్న రైల్ రోకో సందర్భంగా పోలీసులు శనివారం అరెస్ట్ ల పర్వం సాగించారు.  రైల్ రోకోలో  పాల్గొంటున్న నేతలను పోలీసులు ఎక్కడకక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రామగుండం విద్యుత్ నగర్ వద్ద ఎంపీ వివేక్, బాసర రైల్వేస్టేషన్ లో ఎమ్మెల్యే వేణుగోపాలచారి, మహబూబ్ నగర్ లో మాజీఎంపీ జితేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా రాంపూర్ లో విజయ రామారావు, ఆలూరు రమేష్, మెదక్ జిల్లా బూరుగుపల్లి వద్ద హరీశ్ రావు, కరీంనగర్ జిల్లాలో ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ మౌలాలీలో కవిత, సీతాఫల్ మండీలో కేటీఆర్, ఖాజీపేటలో ఎంపీ రాజయ్య తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఎమ్మెల్యేలు ఓదెలు, కావేటి సమ్మయ్య, నాయిని నర్సింహారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను గృహ నిర్బంధంలో ఉంచారు. నల్గొండ జిల్లా భువనగిరిలో రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, కేశవరావులను పోలీసులు  అరెస్ట్ చేశారు. రైల్ రోకో సందర్భంగా తెలంగాణ జిల్లాల్లోని రైల్వేస్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించారు. పక్క జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు జంక్షన్లుగా ఉండే రైల్వే స్టేషన్లను పోలీసులు పహరా కాస్తున్నారు. కాగా పలు ప్రాంతాలకు పగటి పూట రైళ్లను దక్షిణమధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...