ఇంకా టైం పడుద్ది..తెలంగాణాపై ఢిల్లీ మాట...

న్యూఢిల్లీ,అక్టోబర్ 2: తెలంగాణ సమస్యపై శనివారం వరుసగా రెండో రోజూ కూడా కాంగ్రెస్ సీనియర్లు  తీవ్రస్థాయిలో తర్జనభర్జన పడ్డారు. సామరస్యపూర్వక పరిష్కారానికి ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాలపై మల్లగుల్లాలు పడ్డారు. కానీ ఎప్పట్లాగే ఓ నిర్ణయానికి మాత్రం రాలేకపోయారు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. పలు వర్గాలతో మరిన్ని సంప్రదింపులు అవసరమని, కసరత్తు పూర్తవడానికి ‘కొంత సమయం’ పడుతుందని భేటీ అనంతరం ప్రణబ్ ప్రకటించగా, ఇప్పటిదాకా సాధించిన పురోగతి ఇదేనని ఆజాద్ అన్నారు. పరిస్థితి తీవ్రత గురించి తనకు తెలుసంటూ ప్రణబ్ ముక్తాయిస్తే, పరిష్కారం అంత తేలికేమీ కాదంటూ ఆజాద్ కుండబద్దలు కొట్టారు.తెలుగు మీడియాపై ఆజాద్ అసంతృప్తి వెలిబుచ్చారు. ‘‘ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఎవరికి తోచినట్టు వారు కథనాలిస్తున్నారు. కొన్ని చానళ్లలో వచ్చినట్టుగా తానెలాంటి ప్రతిపాదనలూ చేయలేదని’ అన్నారు. కాగా, కాంగ్రెస్ కోర్ కమిటీ ముఖ్యులంతా  ఆదివారం తలో చోటికి పయనమవుతున్నారు. దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రణబ్ కోల్‌కతా వెళ్తున్నారు. 6, 7 తేదీల్లో ఆయన తిరిగి వస్తారని సమాచారం. ఆంటోనీ సోమవారం ఉదయయం మూడు రోజులపాటు రష్యా పర్యటనకు వెళ్తున్నారు. ఆదివారం ఆజాద్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఉంది. ఈ సందర్భంగా సీఎం కిరణ్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర పరిస్థితిని సమీక్షిస్తారని, తదుపరి చర్యలపై సూచనలిస్తారని భావిస్తున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు