Wednesday, October 19, 2011

జానారెడ్డికి పొడుచుకొచ్చింది...

 హైదరాబాద్ ,అక్టోబర్ 19:   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారు.   కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ సమావేశంలో సహచరులంతా జనారెడ్డిని లక్ష్యం చేసుకుని విమర్శలు  చేశారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా కలత చెందిన జానా రెడ్డి రాజీనామాకు సిద్ధపడడమే కాకుండా సహచర తెలంగాణ మంత్రులతో చర్చలు జరిపేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జానా రెడ్డిని చర్చలకు ఆహ్వానించారు. దీంతో జానారెడ్డి బుధవారం ఉదయం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. రాజీనామాలు చేసే విషయంలో తొందర పడవద్దని, ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి రాజీనామాలుచేస్తే ఇబ్బందుల ఎదురవుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జానా రెడ్డితో చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు ఓపిక పట్టాలని కిరణ్ కుమార్ రెడ్డి జానారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశం తర్వాత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా జానారెడ్డితో మాట్లాడారు. రాజీనామాలు చేసే విషయంలో తొందరపడవద్దని ఆయన జానారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది.
తనపై వచ్చిన విమర్శలకు  జానారెడ్డి కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశనాంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు.  తెలంగాణ సాధనే తన లక్ష్యమని ఆయన అన్నారు. తన రాజీనామా వల్ల మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని చెప్తే తాను ఇప్పుడే రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మెను విరమించాలని తాను చేసిన విజ్ఞప్తిని కొంత మంది, శ్రేణులు, ప్రజా సంఘాలు అనుమానించాయని, తాను తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు. సమ్మెకు విరామం ఇవ్వాలని మాత్రమే తాను భావించి ఆ ప్రకటన చేశానని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆయన అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...