Friday, October 21, 2011

హమ్మయ్య...సిరీస్ గెలిచేశాం...

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రహానే
మొహాలీ, అక్టోబర్ 21: ఇక్కడి  పీసీఏ స్టేడియంలో గురువారం జరిగిన మూడో వన్డేలో ధోనిసేన ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. 299 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ రహానే (104 బంతుల్లో 91; 6 ఫోర్లు) ఓపికగా బ్యాటింగ్ చేసినా కొద్దిలో సంచరీ మిస్సయ్యాడు.   మరో ఓపెనర్ పార్థీవ్ (46 బంతుల్లో 38; 3 ఫోర్లు) రాణించాడు. రెండో వన్డేలో చెలరేగి ఆడిన గంభీర్ (60 బంతుల్లో 58; 3 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీ సాధించగా... కోహ్లి (30 బంతుల్లో 35; 5 ఫోర్లు) చేశాడు.  ఆఖరి దశలో ధోని (31 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు) , జడేజా (24 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయాన్ని ఖరారు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్, బ్రెస్నన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ కీస్వెట్టర్ (38 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మంచి ఆరంభాన్నిచ్చాడు. ట్రాట్ (116 బంతుల్లో 98 నాటౌట్; 8 ఫోర్లు) చివరి వరకూ నిలకడగా ఆడినా కొద్దిలో సెంచరీని మిస్ అయ్యాడు. పీటర్సన్ (61 బంతుల్లో 64; 9 ఫోర్లు) సొగసైన ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీ చేశాడు. చివరి ఓవర్లలో సమిత్ పటేల్ (43 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపువేగంతో పరుగులు చేయడంతో ఇంగ్లండ్‌కు భారీ స్కోరు లభించింది. భారత బౌలర్లలో ప్రవీణ్, వినయ్, కోహ్లి, జడేజా ఒక్కో వికెట్ తీసుకున్నారు. రహానేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్ 3-0తో కైవసం చేసుకుంది. నాలుగో వన్డే ఆదివారం ముంబైలో జరుగుతుంది.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...