Wednesday, October 5, 2011

చంద్రబాబు తటస్థవాదం...!

హైదరాబాద్,అక్టోబర్ 5:  రాష్ట్రంలో అస్థిరత్వానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని, సమస్యకు పరిష్కారం చూపాల్సిన వ్యక్తులు చేష్టలుడిగి చోద్యం చూస్తుండటం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్ర విభజన విషయంలో తాము  తటస్థంగా ఉంటామని,  సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై  ఉందని,. ఆయా ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఇరు ప్రాంతాల నేతలకు చెప్పానని ఆయన అన్నారు.  ''ప్రతిపక్ష పార్టీగా మహానాడులో మా వైఖరి స్పష్టం చేశాం. ఈ విషయంలో అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. టీడీపీని దెబ్బతీయడానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం శ్రీ కృష్ణ కమిటీని నియమించిన కేంద్రం.. ఆ కమిటీ నివేదిక అందాక ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం వల్లే రాష్ట్రంలో రైతులు విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘‘45 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చారు. ముందే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి ప్రయత్నాలు ఏమీ జరిగినట్టు కనిపించడం లేదు.  ‘‘ప్రజల ఇబ్బందులకు కేసీఆర్, కోదండరాంలదే బాధ్యత అని సీఎం అనడం వేరే విషయం. ముందు బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఏమీ చేసిందో చెప్పాలి’’ అని నిలదీశారు. ‘‘సకల జనుల సమ్మెలో భాగంగా సామాన్య ప్రజానీకం ప్రయాణిస్తున్న బస్సులపై దాడులు చేయడం సరికాదు. ప్రజలేం నేరం చేశారు. ఈ దాడులను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది’’ అని పేర్కొన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...