తెలంగాణాకు పరిష్కారం అంత తేలిక కాదు:ప్రణబ్

కోల్‌కతా,అక్టోబర్ 5:  తెలంగాణ సమస్య సున్నితమైందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. 50 ఏళ్ల నుంచి తెలంగాణ డిమాండ్ ఉందని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సమస్యను నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించడం కష్టమని ఆయన చెప్పారు. పత్యేక తెలంగాణరాష్ట్రం ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో మరిన్ని కొత్త రాష్ట్రాల కోసం డిమాండ్‌లు వచ్చే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఇంకా చర్చ జరగాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూస్తామని ప్రణబ్ అన్నారు. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ భవిష్యత్ నాయకుడు అని ప్రణబ్ ముఖర్జీ తేల్చి చెప్పారు. ‘కాంగ్రెస్‌కు ఎప్పుడూ కొత్త నాయకత్వం ఉంటుంది. రాహుల్ మా భవిష్యత్ నేత కానున్నారు’ అని ఆయన అన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు