Wednesday, October 5, 2011

సోమాలియా రాజధానిలో భారీ పేలుడు

మొగదిషు,అక్టోబర్ 5:  సోమాలియా రాజధాని మొగదిషులో భారీ పేలుడు సంభవించి కనీసం 65 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రభుత్వ భవనాల్లో బాంబు పేలింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఆల్ షబాబ్ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. పరీక్షలు రాయడానికి మంగళవారం విద్యార్థులు గుమిగూడిన సమయంలో నాలుగు ప్రభుత్వ మంత్రిత్వ శాఖల గృహ సముదాయంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడులో మరణించినవారి 65 మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 50 మంది దాకా గాయపడ్డారు.  తమ లక్ష్యం మంత్రులేనని ఆల్ షబాబ్ చెప్పింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...