సోమాలియా రాజధానిలో భారీ పేలుడు

మొగదిషు,అక్టోబర్ 5:  సోమాలియా రాజధాని మొగదిషులో భారీ పేలుడు సంభవించి కనీసం 65 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రభుత్వ భవనాల్లో బాంబు పేలింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఆల్ షబాబ్ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. పరీక్షలు రాయడానికి మంగళవారం విద్యార్థులు గుమిగూడిన సమయంలో నాలుగు ప్రభుత్వ మంత్రిత్వ శాఖల గృహ సముదాయంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడులో మరణించినవారి 65 మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 50 మంది దాకా గాయపడ్డారు.  తమ లక్ష్యం మంత్రులేనని ఆల్ షబాబ్ చెప్పింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు