టర్కీలో భారీ భూకంపం: 300 మందికి పైగా మృతి
అంకారా,అక్టోబర్ 23: ఈశాన్య టర్కీలో సంభవించిన భారీ భూకంపం లో 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వందలాదిమంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదైంది. భూకంప తీవ్రతకు అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. టర్కీలో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాల్లో ఇదే అతి పెద్దది. భూకంపం తర్వాతి ప్రకంపనలు ఇరాన్ సరిహద్దున ఉన్న వాన్ సిటీని తాకాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా కుర్దులుంటారు. కూలిపోయిన భవనాలను, వాహనాలను, ప్రజలు ఇళ్లు వదిలి పారిపోతున్న దృశ్యాలను టీవీలు ప్రసారం చేశాయి. టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింది.
Comments