నాలుగో వన్డేలోనూ ధోనీసేన గెలుపు

ముంబై,అక్టోబర్ 23:  ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారమిక్కడ జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సిరీస్‌లో 4-0 ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 221 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 40.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేరుకుంది. కొహ్లి(86), రైనా(80) అర్థ సెంచరీలతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ధోనీ 15, రహానే 20 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 46.1 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటయింది. రైనాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు