Monday, October 24, 2011

42 రోజుల సమ్మెను విరమించిన టి. ఉద్యోగులు

హైదరాబాద్,అక్టోబర్ 24:  తెలంగాణ ఉద్యోగ సంఘాలు  42 రోజుల సమ్మెను విరమించాయి. సోమవారం రోజంతా ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగ సంఘాలతో  జరిపిన చర్చలు ఫలించాయి. సమ్మె విరమించడానికి వారు అంగీకరించారు.  మొత్తం 9 అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి జెఎసి నేతలకు మధ్య ఒప్పందం కుదిరింది. మంగళవారం నుంచి విధులలో చేరేందుకు నేతలు అంగీకరించారు. ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల మధ్య కుదిరిన  ఒప్పందం వివరాలు... 1. 610 జీవో అమలు పర్యవేక్షణకు హైకోర్టు మాజీ న్యాయమూర్తితో న్యాయ కమిటీ ఏర్పాటు 2. సమ్మె కాలంలో ఎస్మా ప్రయోగం నిలిపివేత 3. ఉద్యోగులపై కేసులు ఎత్తివేత 4.177 జీవో అమలు సమ్మె కాలంలో నిలిపివేత 5. సమ్మె కాలంలో బదిలీలు, డిపుటేషన్లు రద్దు 6. నో వర్క్, నో పే అమల్లో ఉన్నా స్పెషల్ కేసుగా పరిగణిస్తూ మినహాయింపు 7. సమ్మెకాలంలో కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ఆంక్షలు మినహాయింపు 8. సమ్మెకాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ హాఫ్ పే లీవు 9. మంగళవారం నుంచి విధుల్లో చేరేందుకు అంగీకారం. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...