వాషింగ్టన్,అక్టోబర్ 19: కాలంచెల్లిన జర్మన్ ఉపగ్రహం రోయింట్జెన్ శాటిలైట్ (రోశాట్) ఈ శని లేదా ఆదివారాల్లో భూమిపై కూలిపోయే అవకాశముందని జర్మనీ అంతరిక్ష సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడించారు. గత నెలలో పసిఫిక్ సముద్రం ప్రాంతంలో నేలరాలిన అమెరికా ఉపగ్రహం ఆర్స్ మాదిరిగానే ఇది కూడా ఎక్కడ కూలిపోనుందన్న వివరాలు ముందస్తుగా తెలియడంలేదని వారు తెలిపారు. ఈ ఉపగ్రహ శకలాలు భూమిని తాకడానికి రెండు గంటల ముందు మాత్రమే ఆ విషయం తెలుస్తుందన్నారు. వాస్తవానికి ఈ నెల 21, 25 తేదీల మధ్య భూవాతావరణంలోకి రోశాట్ ప్రవేశించవచ్చని ఇంతకుముందు అంచనావేశారు. రోశాట్ మొత్తం బరువు 2.4 టన్నుల బరువు కాగా, అది భూవాతావరణంలోకి ప్రవేశించి ముక్కలయ్యాక దాదాపు 1.7 టన్నుల గాజు, పింగాణీ శకలాలు భూమిని తాకవచ్చని భావిస్తున్నారు. రోశాట్కు చెందిన 30 పెద్ద సైజు శకలాలు ఉత్తర అమెరికాలోని కెనడా నుంచి దక్షిణ అమెరికా ప్రాంతం మధ్యలో పడే అవకాశముందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే సౌర గాలులు, వాతావరణ పరిస్థితులను బట్టి కూడా రోశాట్ కూలిపోయే సమయం ఆధారపడి ఉంటుందన్నారు. కాగా 1990లో ప్రయోగించిన రోశాట్లో సూర్యుడికి అభిముఖంగా ఉన్న కెమెరా పాడైపోవడంతో ఉపగ్రహం పనిచేయడం మానేసింది. దీంతో 1999లో జర్మనీ ఈ ఉపగ్ర హాన్ని స్తంభింపచేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment