హైదరాబాద్, అక్టోబర్ 25: శాసనమండలి స్థానానికి కాంగ్రస్ అభ్యర్థిగా పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఎంపిక రాష్ట్ర పార్టీలో రాజకీయంగా ఉత్కంఠ రేపింది. తెలంగాణకు చెందిన డీఎస్కు మున్ముందు ప్రభుత్వంలో కీలక పదవి అప్పగించే ఉద్దేశంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని చర్చ జరుగుతోంది. లోతైన కసరత్తు అనంతరం అధ్యక్షురాలు సోనియానే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మూడురోజులు ఢిల్లీలో మకాం వేసిన కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్సలకు కనీస సమాచారమైనా ఇవ్వకుండానే డీఎస్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. వారిద్దరూ హైదరాబాద్ తిరిగొచ్చాక, అదీ అర్ధరాత్రి సమయంలో డీఎస్ ఎంపికపై అధిష్టానం నుంచి సమాచారం రావడం వారిద్దరికీ మింగుడు పడని విషయం. సోమవారం డీఎస్ నామినేషన్కు వీరిద్దరితో పాటు ఏకంగా 13 మంది మంత్రులు, భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీఆర్పీ నేతలు తరలిరావడం కూడా చిన్న విషయం ఏమీ కాదేమో. ముఖ్యంగా డీఎస్ అభ్యర్థిత్వాన్ని తొలినుంచీ వ్యతిరేకిస్తున్న కిరణ్కు ఈ నిర్ణయంతో అధిష్టానం పెద్ద షాకే ఇచ్చిందని పార్టీ వర్గాలంటున్నాయి. డీఎస్ నామినేషన్ పూర్తయ్యేదాకా ముఖ్యమంత్రి ముభావంగానే కన్పించడం కొసమెరుపు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment