Friday, October 7, 2011

ముగ్గురు మహిళలకు నోబెల్ శాంతి

ఓస్లో,అక్టోబర్ 7:  2011 సంవత్సరానికి అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి  ముగ్గురు మహిళలు ఎంపికయ్యారు.  మహిళల హక్కులపై పోరాటం చేసిన లెబైరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్, లైబేరియా శాంతి ఉద్యమ కార్యకర్త లేమా, యెమెన్‌కు చెందిన తవక్కల్ కర్మాణ్‌లకు నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా ప్రకటించారు. అహింసా మార్గంలో మహిళ హక్కుల కోసం పోరాట చేసినందుకు వీరికి నోబెల్ శాంతి బహుమతిని ఇస్తున్నాట్టు  నార్వే నోబెల్ కమిటీ  తెలిపింది. ఆర్ధికశాస్త్రంలో హార్వర్డ్ నుంచి పట్టా పొందిన జాన్సన్ సర్లీఫ్ 2005 సంవత్సరంలో ప్రజాస్వామ్య బద్ధంగా తొలి ఆఫ్రికా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. లైబేరియా యుద్ధ నాయకులకు వ్యతిరేకంగా లేమా బోవీ పోరాటం సాగిస్తున్నారు. క్రిస్టియన్, ముస్లీ మహిళల సంఘాల ఆధ్వర్యంలో మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.యెమెన్ అధ్యక్షుడు అలీ అబ్దులా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న తవక్కల్ కర్మాణ్ ఓ జర్నలిస్ట్. హ్యూమన్‌రైట్స్ గ్రూఫ్ ఫర్ జర్నలిస్ట్, ఇతర జర్నలిస్ట్ సంఘాలకు నేతృత్వం వహిస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...