నెల్లూరు.అక్టోబర్ 10: : శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ- సీ 18 రాకెట్ ప్రయోగానికి సోమవారం ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ కౌంట్డౌన్ 50 గంటల పాటు కొనసాఉతుంది. 12న ఉదయం 11 గంటలకు పీఎస్ఎల్వీ సీ-18 ప్రయోగం జరపనున్నారు. ఈ ప్రయోగంలో ఇస్రో, ఫ్రెంచి అంతరిక్ష సంస్థ సంయుక్తంగా తయారు చేసిన మేఘా-ట్రోఫిక్స్ ఉపగ్రహంతో పాటు మరో మూడు చిన్న తరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. 44.4 మీటర్లు పొడవు కలిగి 2.8 మీటర్లు వ్యాసార్థం కలిగిన పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహక నౌకను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఇందులో మొదటి దశలో ప్రపంచంలో వాడే అతి పెద్ద ఘన ఇంధన బూస్టర్లు సాయంతో ప్రయోగం ప్రారంభమవుతుంది. రెండోదశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగోదశలో ద్రవ ఇంధన సాయంతో వాహకనౌక పయనించి, ఉపగ్రహాలను రోదసీలోని నిర్ణీత కక్ష్యలలోకి ప్రవేశపెడుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment