హైదరాబాద్,అక్టోబర్ 30: రాష్ట్రంలో 15 జిల్లాల్లోని 456 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ‘‘15 జిల్లాల్లోని 782 మండలాలకుగాను 456 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్న కలెక్టర్ల నివేదికల ఆధారంగా వాటిని కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ తొలి దశలో నిర్ణయించామని , పంటకోత పూర్తయ్యాక రెండో దశలో మరిన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ఉందని మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార మంత్రి డి.కె.అరుణ తెలిపారు. అనంతపురం జిల్లాలలో లో మొత్తం మండలాలను, అనంతరం అత్యధికంగా నల్లగొండలో 52 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు.
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోఅవతరణ ఉత్సవాలు
తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో ఈ ఏడాది రాష్ట్ర అవతరణ ఉత్సవాలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో జరిగే అవతరణ ఉత్సవాలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జెండా ఎగురవేస్తారు. జిల్లాలలో మాత్రం కలెక్టర్లు రాష్ట్ర అవతర ఉత్సవాలలో పాల్గొంటారు.
అజాద్...అదేమాట
తెలంగాణ అంశాన్ని పరిష్కరించడానికి నిర్దిష్ట గడువేమీ లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ మరోసారి తెలిపారు. అయినప్పటికీ, త్వరగానే పరిష్కరిస్తామని పునరుద్ఘాటించారు.
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోఅవతరణ ఉత్సవాలు
తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో ఈ ఏడాది రాష్ట్ర అవతరణ ఉత్సవాలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో జరిగే అవతరణ ఉత్సవాలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జెండా ఎగురవేస్తారు. జిల్లాలలో మాత్రం కలెక్టర్లు రాష్ట్ర అవతర ఉత్సవాలలో పాల్గొంటారు.
అజాద్...అదేమాట
తెలంగాణ అంశాన్ని పరిష్కరించడానికి నిర్దిష్ట గడువేమీ లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ మరోసారి తెలిపారు. అయినప్పటికీ, త్వరగానే పరిష్కరిస్తామని పునరుద్ఘాటించారు.
No comments:
Post a Comment