ఇంటర్, టెంత్ పరీక్షల తేదీలు ఖరారు

హైదరాబాద్ ,అక్టోబర్ 29:  పదవ తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలను విద్యాశాఖ శనివారం ప్రకటించింది. మార్చి 2 నుంచి మార్చి 21వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ పరీక్షలు, మార్చి 26 నుంచి ఏప్రిల్ 11వ తేదీవరకూ పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ... పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరగనున్నాయి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు